పోస్ట్‌లు

మే, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

సనాతనధర్మం లో సతీసహగమనం - Sati in Sanatan Dharma

చిత్రం
హిందూధర్మం లో సతీసహగమనం వేదాలలో సతీ ప్రధ - Sati in Vedas ఇయం నారీ పతిలోకం వ్రుణానా నిపఘత్ ఉపత్వా మధ్య ప్రేతం ధర్మం పురాణ మనుపాలయంతి తస్మై ప్రజాం ద్రవిణం చేహ దోహి అధర్వ వేదం 18/3/1 The Hymns of the Atharvaveda: Book IX. ఈనారి పతిలోక ప్రాప్తి కొరకు ఓ మృతుడవైన పురుషుడా నీ వద్దకు సమీపించుచున్నది. నీతో కలిసి అగ్నిలో కాలి చనిపోవుచున్నది. ఇలా ఆమె సనాతన ధర్మపాలన చేస్తున్నది. ఇలా నీతో కలిసి కాలుతున్న ఈ స్త్రీకి ఈ లోకం, పరలోకం మరియు పునర్జన్మనందు పుత్రా, పౌత్ర ధనమును ప్రసాదించు. భార్య సతీగా అవడం కారణంగా పునర్జన్మనందు కూడా ఈ భర్తే లభిస్తాడు. రామాయణం లో సతీ - Sati in Ramayana దశరథుని మరణం కారణంగా కౌసల్య అంటుంది “ఇదం శరీరమాలింగ్య ప్రక్ష్యామి హ్రుతానం అయోధ్య కాండం 66/12 అనగా నేను మహారాజు శరీరాన్ని ఆలింగనం చేసుకుని అగ్నిలో ప్రవేశిస్తాను. ఆమె సతీసహగమనం చేయలేదు అన్నది నిజమైనా ఈ సందర్భం. హైందవసంస్కృతి లో సనాతన కాలం నుండి సతీ సహగమనం ఉందని నిరూపిస్తుంది. అలాగే యద కాండ 32/32లో రావణానుగామిష్యామి గతిం భార్తుర్మహాత్మనై - రావణా నేను నా భర్తతో కలిసి సతీగా అవుతాను. తతో మే జననీ దీనా తచ్చరీరం పితుర్మము, పరిశ్వజ...

భారత చరిత్ర సింధు నాగరికత నుండి .. Indian History - భారత దేశంలో ఏకేశ్వర వాదం - Ancient Indian History

చిత్రం
  భారత దేశంలో ఏకేశ్వర వాదం.. భారత దేశానికి మిషనరీల రాక కేవలం 15వ శతాబ్దంలో మొదలయ్యింది అని అనుకోవడం చరిత్రను పూర్తిగా అధ్యయనం చేయక పోవడమే అవుతుంది. ఎందుకంటే జెసుయిట్లు మన దేశానికి మిషనరీ పనికి రాక ముందు నుండే మన దేశంలో క్రైస్తవ మిషనరీ పని మొదలయ్యింది. క్రైస్తవ భావజాలాన్ని బైబిలు నేర్పే ఏకేశ్వర వాదాన్ని ఈ భూభాగంలో తెలియపరచడానికి క్రీస్తు పూర్వం నుండి కూడా ఈ భూభాగ ప్రజలతో మధ్య ఆసియా ప్రజలకు వర్తక, వ్యాపార, రాజకీయ సంబంధాలు ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. ప్రముఖ చరిత్రకారిణి రోమిలా థాపర్ గారి ప్రకారం: క్రీ.పూ. 2600 - 1700 వరకు హరప్పా నాగరికత మన దేశంలో కొనసాగింది. క్రీ.పూ. 1500 - 500 వరకు వైదిక, నియోలితిక్ మరియు చాల్కొలితిక్ సంస్కృతుల వలస, ప్రభావం, ఆవిర్భావం చూస్తాం. క్రీ.పూ. 6వ శతాబ్దంలో గంగానదీ పరివాహక ప్రాంతాలలో నగరాలు, రాజ్య స్థాపనలు మొదలయ్యి మగధ రాజ్యం, మహావీర మరియు గౌతమ బుద్ధుల దర్శనం ఆవిర్భవించినట్టు చూస్తాం. క్రీ.పూ. 519లో పర్షియాకు చెందిన అకేమేడియన్ రాజు సైరస్ (కోరేష్) ఉత్తరభారత భూభాగాన్ని చాల వరకు తన రాజ్యంలో విలీనం చేయడంలో విజయం సాధించాడు. క్రీ.పూ. 493లో అజాత శత్రు రాజ్య స్థాపన చే...