స్త్రీ ల గురించీ సనాతన ధర్మం - Sanatan Dharma about Women

స్త్రీ లపై సనాతన ధర్మం చేసిన అనుచిత వ్యాఖ్యలు.. 

Abusive comments on women in SanatanaDharma..

సనాతనధర్మం ప్రకారం అసలు ఆడవారిని భగవంతుడు ఎందుకూ చేసాడు? 
Why did God create women in SanatanDharm? 


మనుస్మృతి 2:213,214 - పురుషున్ని మలినపరచడానికి చేయబడింది. మహాభారతం 13.19 స్త్రీలు చెడ్డవారని వేదాలు ఘోషిస్తున్నాయి.

వాల్మీకి రామాయణం, అరణ్యకాండం, 45వ సర్గ. 29-30 లక్ష్మణుడు సీతతో అన్న మాట - "భూమి పై స్త్రీలకున్న లక్షణం ఇదే. వారు స్వభావరీత్యా చెడిపోయిన వంకర స్వభావం, చంచల స్వభావం, ధర్మం తెలియని, తండ్రి తనయుల మధ్య బేధం తెచ్చే స్వభావం కలిగి ఉన్నారు..

దేవీభాగవతం 1.15.1-67 మూర్ఖులకు తెలియదు స్త్రీలు యే విధంగా జలగల వలె రక్తం పీలుస్తారో... స్త్రీ కంటే పెద్ద దొంగ యెవడైనా ఉంటాడా?....


సనాతనధర్మం లో స్త్రీ పై గర్భంలో ఉన్నపటి నుండే వివక్ష ప్రారంభo..


పుంసవన్ సంస్కార్ అపసవ్య మనస్తత్వానికి పరాకాష్ట పుంసవన్ సంస్కార్ గురించి స్వామిదయానందసరస్వతి సహచరుడు మరియు తరువాత సనాతన ధర్మ నాయకుడుగా ప్రసిద్ధికెక్కిన వేదవ్యాఖ్యాత - పండిట్ భీమ్ సేన్ శర్మ అంటారు "ఉత్పత్స్య మాన గర్భస్య బైజిక గార్భిక దోష న పరిహారార్థం పుం రూపత్వ సంపత్తయే చ పుంసవనం" (షోడశ సంస్కార విధి, తఅతీయ సంస్కరణ, 1926, పేజీ 72-73) అనగా గర్భమునుండి జన్మించ బోయే పిల్లల యొక్క వీర్యం మరియు గర్భ సంబంధిత దోషములు నివృత్తి కొరకు మరియు గర్భము పురుష రూపం పొందటం కొరకు పుంసవన సంస్కారం చేస్తారు. మరో మాటలో చెప్పాలంటే, ప్రతి గర్భంలో మగ రూపాన్ని పొందడం కోసం ఈ తంతు జరుగుతుంది. 

గర్భంలో ఒక అమ్మాయి ఉంటే, ఆ అమ్మాయి పిండాన్ని అబ్బాయిగా మార్చాలనే లక్ష్యంతో ఈ సంస్కారం చేస్తారు. ఈ అమ్మాయి పిండం వదిలించుకోవడానికి ఒక పురాతన వేద పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఎంత ప్రభావవంతమైనదో పక్కన పెడితే, దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అనగా హిందూ సమాజంలోని అమ్మాయిలందరూ వారి శరీరాలను వదిలించుకోవడానికి ఈ సనాతన వైదిక మార్గాన్ని కనుగొన్నారు. పిండంలోనే మంత్రాల యొక్క శక్తితో అమ్మాయి అబ్బాయిగా మారితే, అమ్మాయి పుట్టదు కానీ అబ్బాయి పుడతాడు అన్న నమ్మకంతో ఈ కార్యం చేస్తారు. ఈ రోజు కూడా ఈ దేశంలో అమ్మాయి పుట్టాలని ఎవరూ కోరుకోవడం లేదంటే అది పురాతన కాలం నుండి వస్తున్న స్త్రీ పట్ల అసమానతను సూచిస్తుంది.

పుంసవన్ సంస్కారాలకు సంబంధించి స్వామి దయానంద్ తన సంస్కార విధిలో వేదాల నుండి ఐదు రుజువులను సంస్కృ త భాషలో ఇచ్చారు. అందులో అతను అర్థం వ్రాయలేదు, కానీ ఆర్యసమాజానికి చెందిన పండితులు వారికి రాసిన అర్ధాలు చాలా స్పష్టంగా తెలుపుతున్నారు. రామ్ గోపాల్ విద్యాలంకార్ (గురుకుల్ కాంగడీ) గారు అర్థాలతో సహా కొన్ని మంత్రాలను ఉదహరించిన విషయాలు గమనిద్దాం: వున్న పుమానింద్ర పుమందేవ బృహస్పతిహ్ పుత్రం విందస్వ తమ్ పుమానను కాయతాం స్వాహా       -మంత్రబ్రహ్మణ 1/4/9

అనగా అగ్ని, ఇంద్రుడు మరియు అనేక విద్యలు నేర్చుకున్న పండితుడు - వీరందరూ నీకు బలాన్ని ఇస్తారు. నీవు శక్తివంతమైన పుత్రున్ని పొందుము మరియు దాని సంతానం కూడా శక్తివంతమవుగాక.

షమీమశ్వత్య అర్ధుడస్థత్ర పుంసవనం కృతం, తద్వై పుత్రస్య వేదనం తత్తీష్వాధరామని...

ధర్వవేదం 6/11/1

అంటే ప్రశాంత స్వభావం ఉన్న స్త్రీపై గుర్రం వంటి వీర్యం గలవాడు ఆరోహణ ద్వారా గర్భాదానం జరుగుతుంది. ఆ తరువాత పుంసవనం చేయాలి. ఎందుకంటే పుత్రుణ్ణి పొందడానికి ఇదే ఉత్తమ మార్గం. మనం స్త్రీలలో ఆ శుభకర్మ చేయాలి.

పంసి వై రేతో భవతి తత్ సియామనుషిచ్చతే తద్దె పుత్రస్య వేదనం తత్తజాపతిరభ్రవీత్,

ధర్వవేదం 6/11/2

అంటే, పురుషునిలో వీర్యం ఉంటుంది, దానిని స్త్రీ యందు సాగు చేయాలి.

ప్రజాపతిరనుమతి సినీవాల్యదీక్లుపత్

సైమమన్నత్ర దద్యత్పుమానము దద్దదిహ.

అధర్వవేదం 6/11/3

అనగా ప్రజాపతి, అనుమతి మరియు సినీవాలీ (సంవత్సరం, పూర్ణిమ మరియు అమావాస్య) ఇవన్నీ కూడా గర్భాన్ని పరాకాష్టగా చేస్తాయి. స్త్రీ ప్రసవ నియమాలు అన్యత్రంగా ఉన్నాయి. ఇక్కడ పురుష సంబంధిత వివరాలు ఉన్నాయి. (సంస్కార ప్రకాష్ అనగా మహర్షి దయానంద సరస్వతి ప్రణీత సంస్కార విధి, టీకా తాత్పర్యం సహా, విక్రమీ సంవత్ 1984 (1927) పేజీ 43-44-హిందీ పుస్తకం)


కృష్ణుడు

వరాహపురాణం 177.17-22 నారదునితో కృష్ణుడు స్త్రీల కామ కోరికను గురించి వారు యెలా పాపంలో పడవేస్తారో వర్ణిస్తూ 'వారికి సమయం సందర్భం యెవరున్నారు, యెవరైనా చూస్తారా? అన్న తేడా తెలియదు. వారు చిన్న బాలికలైనా, యువతులైనా, వృద్ధులైనా, అందమైన పురుషున్ని చూస్తే చాలు కోరికలతో చెలరేగి పోతారు. అది వారికి స్వభావికం.

దేవీభాగవతం 1.5.83 "అబద్ధములాడడం, ఉత్తుత్తి ధైర్యం, మోసపూరిత బుద్ధి, మూర్ఖత్వం, ఓపిక లేక పోవడం, అధిక లోభం, అపవిత్రత, కటుత్వం స్త్రీల గుణాలు.

Sanatan Dharma about women


మను 7.150 (అటువంటి జంతువుల వలె నీచమైన (వ్యక్తులు), మరియు ముఖ్యంగా మహిళలు రహస్యమందలి ఆలోచనను దాచరు. ఆ కారణంగా అతను వారికి సంబంధించి జాగ్రత్తగా ఉండాలి. ఋగ్వేదం 10.95.15 చనిపోకండి, పురుషులారా, అదృశ్యమవ్వకండి: వికారమైన తోడేళ్ళు నిన్ను మ్రింగివేయవద్దు. ఆడ స్నేహాలు లేవు. మహిళలతో శాశ్వత స్నేహం ఉండదు: హైనాల హృదయాల వంటివి. మహిళల హృదయాలు.

Manu about women

భగవత్ పురాణం 9.14.36-38 స్త్రీల హృదయం నక్క వంటిది, . ఆమెతో స్నేహం ఉపయోగకరం కాదు. ఆడ జాతి స్వాభావికంగా కరుణ లేని మోసగాళ్ళు..

ఒకడు తన సుఖాన్ని కోల్పోవడానికే స్త్రీని కలిగి ఉంటాడు.... స్త్రీ యెన్నటికి చండాలుడు, సుఖానికి కారణం అవ్వదు కేవలం దుఃఖానికే కారణం అవుతుంది. స్త్రీలు పందులతో సమానం మనుస్మృతి 3.239 -

పంది, కుక్క, ఋతుస్రావం చేసే స్త్రీ మరియు ఒక నపుంసకుడు బ్రాహ్మణుడు తింటుండగా అతనిని చూడకూడదు.

ఋతుస్రావం కలిగి ఉన్న స్త్రీ బ్రాహ్మణున్ని తాకితే కొరడాలతో కొట్టాలి. - విష్ణు స్మృతి 5. 105

స్త్రీకి స్వాతంత్య్రం ఇవ్వ కూడదు - నారద పురాణం, ఉత్తర భాగం 24.46-47 స్వాతంత్రంలో మెలిగే స్త్రీ నరకాన్ని పొందుకుంటుంది.

మనుస్మృతి 5.147 148 స్త్రీ స్వాతంత్ర్యం కలిగి ఉండకూడదు. చిన్నతనంలో తండ్రికి అధీనంగా ఉండాలి. యవ్వనంలో భర్త ఆధీనంలో ఉండాలి. వైధవ్యంలో పుత్రుల ఆధీనంలో ఉండాలి; యెప్పటికీ స్వతంత్రంగా ఉండకూడదు. ఇదే మాట యజ్ఞవల్క్య స్మృతి 85, మహాభారతం 13.20, 45, గరుడ పురాణం 1.115.63 విష్ణు స్మృతి 25.12-13 లలో కూడా చెప్పబడింది.

          స్త్రీలు వారి ఆరిష్టం: 

గరుడపురాణం 1.64.8 అధిక రోమాలు, చనులు, మరియు పెదవులు ఉన్న స్త్రీల భర్తలు త్వరగా చనిపోతారు.


                     స్త్రీలు కామాంధులు

స్కందపురాణం 7.1.101.28 శ్రేష్టమైన పురుషున్ని చూస్తే చాలు స్త్రీలు, యోనిలు (సన్యాసినులు అయినా తడిసి (మర్మాంగాలలో) పోతారు.

స్కంద పురాణం 5.3.121.7-9 సాధారణముగా స్త్రీలు కామ కోరిక యెక్కువగా కలిగి ఉంటారు, ముఖ్యంగా బహిష్టు అయిన సమయంలో ఇంకా యెక్కువగా కామ బాణాలతో సంధించబడతారు. వారి భర్తలు స్పందించకపోతే.. వేరే వారితో కామ క్రీడ కోరుకుంటారు.

మహాభారతం 13, 19 స్త్రీలు కామ కోరికలతో రేగిపోయే వారు. వేలల్లో, | లక్షలలో ఒక్కరే పతివ్రతలు, కామ కోరికలో ఉన్నప్పుడు కుటుంబం, తండ్రి, తల్లి, భర్త, కొడుకు, మరిది అన్న విచక్షణ లేకుండా వారి కోరిక మేరకు చేసుకుంటూ పోతారు...

శివపురాణం, ఉమా సంహిత 5.24.16-36 స్త్రీల కంటే అధిక పాపులు ఇంకెవరూ లేరు. వారే అన్నీ పాపాలకు మూలం... వారు సుందరుడైనా రూపియైన యెవరితోనైనా వారి కామ కోరికలు తీర్చుకుంటారు... మగ వారు దొరకకపోతే వారు సహించలేరు... యెంత మందితో రతి జరిపినా తృప్తి పదరు... పురుషున్ని చూడగానే వారి యోని తడిసి పోతుంది.....

ఇటువంటి మాటలే గరుడ పురాణం 1.109.35-40లో కూడా చూడగలం..

ఆర్య వాంజ్మయంలో స్త్రీ

భారతదేశం లో భ్రూణహత్యలు, స్త్రీహత్యలు జరగడం పెద్దగా ఆశ్చర్యం గోలిపించేవి కావు. కానీ అదే సందర్భంలో, “యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా" అనే పద్యం పదేపదే పలు వేదికలపై మన సంస్కృతిని గురించి విశదీకరించి పొగడటానికి కూడా విరివిగా వాడుతుంటారు. ఆడ వారి పట్ల సమాజంలో ద్వేషం గురించి ఆలోచిస్తే అకస్మాత్తుగా వచ్చినదేమీ కాదు అని చెప్పడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. మనుస్మృతి లో స్త్రీ పట్ల ఉన్న ఆలోచనలను మనం అధ్యయనం చేస్తే, ఈ విషయంలో చాలా ప్రాచీన ఆలోచనలు మన ముందుకు వస్తాయి. మనుస్మృతి సారాంశంలో, బ్రాహ్మణులు మొదలైన వర్ణాలు (ద్విజులు/శూద్రులు కానివారు) వేద కర్మలు జరపాలని చెప్పారు:

వైదికై కర్మ పుణె నిషేకాది ర్విజన్మనామ్. కార్య శరీర సంస్కార పావన ప్రేత్య చెవాచ -మను 2/26.

అనగా, ఈ ప్రపంచంలో మరియు మరణానంతర జీవితంలో కూడా, పవిత్ర ఆచారాలు మొదలైనవి ద్విజుల వైదిక మంత్రాలతో చేయాలి. 'అంతకుముందు, వేద కర్మలు నలభైగా పరిగణించబడ్డాయి, కానీ ఇప్పుడు గత శతాబ్దాల నుండి పదహారు ఆచారాలుగా పరిగణించబడతాయి. అందుకే 16 సంస్కారాల ఆచారాలు మాత్రమే 'సంస్కారవిధి' అనే వాజ్ఞ్మయంలో లభిస్తాయి. మనుస్మృతి చేయమని ఆజ్ఞాపించిన ఆచారాలలో, మొదటిది గర్భాదానం (గర్భం స్థాపించడం) అనే ఆచారం, మరియు రెండవది పుంసవన ఆచారం.

కామెంట్‌లు