ఈస్ట్ ఇండియా కంపెనీ హయాంలో మిషనరీలు వారి తిప్పలు...Missionaries struggles during the East India Company
ఈస్ట్ ఇండియా కంపెనీ హయాంలో మిషనరీలు వారి తిప్పలు... 1793 మరియు 1833 మధ్య భారతదేశంలో క్రైస్తవ మిషనరీల -కార్యకలాపాలు ఈస్ట్ ఇండియా కంపెనీకి భిన్నంగా ఉండేవి, ఎందుకంటే అవి భారతదేశంలో రెండు ముఖ్యమైన యూరోపియన్ ప్రభావాలు. ఇ కాల పరిధిని ఎన్నుకోవడానికి ఒక కారణం ఉంది. 1793 మరియు 1833 మధ్య మిషనరీల నేపథ్యం అనుమతులు లేకుండా పని చేసే వారిలా గడపవలసి వచ్చిన పరిస్థితి అది. 1773లో రాబర్ట్ క్లైవ్ తో రెగ్యులేటింగ్ యార్డ్ మొదలు ఈస్ట్ ఇండియా కంపెనీలోని అధికారదాహం, లంచ గొండితను బ్రిటిష్ ప్రభుత్వ పర్యవేక్షణలో తగ్గుముఖం పట్టింది. 1784లో పిట్స్ యాక్ట్ ద్వారా కంపెనీ డైరెక్టర్ల (ఈస్ట్ ఇండియా కంపెనీ) పైన బోర్డ్ ఆఫ్ కౌని ఆధిపత్యానికి తేర లేపారు బ్రిటిష్ ప్రభుత్వం. 1793లో మిషనరీల రాక గురించి జరిగిన చర్చలో మిషనరీలను భారత దేశంలో రానివ్వకూడదు. అన్న విధంగా చర్చ కొనసాగింది. కానీ 1813లో భారత దేశంలో వర్తక వ్యాపారాలపై ఈస్ట్ ఇండియా కంపెనీ మోనోపోలీ (గుత్తాధిపత్యం) ని రద్దు చేసి మిషనరీల రాకకు స్వాతంత్రాన్ని సిద్ధం చేసింది బ్రిటీష్ ప్రభుత్వం. తరువాతి యాక్ట్ 1833లో చార్టర్ యాక్ట్ ను ఆమోదించారు. అంటే తూర్పు ఇండియా...