పోస్ట్‌లు

ఈస్ట్ ఇండియా కంపెనీ హయాంలో మిషనరీలు వారి తిప్పలు...Missionaries struggles during the East India Company

చిత్రం
ఈస్ట్ ఇండియా కంపెనీ హయాంలో మిషనరీలు వారి తిప్పలు...  1793 మరియు 1833 మధ్య భారతదేశంలో క్రైస్తవ మిషనరీల -కార్యకలాపాలు ఈస్ట్ ఇండియా కంపెనీకి భిన్నంగా ఉండేవి, ఎందుకంటే అవి భారతదేశంలో రెండు ముఖ్యమైన యూరోపియన్ ప్రభావాలు. ఇ కాల పరిధిని ఎన్నుకోవడానికి ఒక కారణం ఉంది. 1793 మరియు 1833 మధ్య మిషనరీల నేపథ్యం అనుమతులు లేకుండా పని చేసే వారిలా గడపవలసి వచ్చిన పరిస్థితి అది. 1773లో రాబర్ట్ క్లైవ్ తో రెగ్యులేటింగ్ యార్డ్ మొదలు ఈస్ట్ ఇండియా కంపెనీలోని అధికారదాహం, లంచ గొండితను బ్రిటిష్ ప్రభుత్వ పర్యవేక్షణలో తగ్గుముఖం పట్టింది. 1784లో పిట్స్ యాక్ట్ ద్వారా కంపెనీ డైరెక్టర్ల (ఈస్ట్ ఇండియా కంపెనీ) పైన బోర్డ్ ఆఫ్ కౌని ఆధిపత్యానికి తేర లేపారు బ్రిటిష్ ప్రభుత్వం.  1793లో మిషనరీల రాక గురించి జరిగిన చర్చలో మిషనరీలను భారత దేశంలో రానివ్వకూడదు. అన్న విధంగా చర్చ కొనసాగింది. కానీ 1813లో భారత దేశంలో వర్తక వ్యాపారాలపై ఈస్ట్ ఇండియా కంపెనీ మోనోపోలీ (గుత్తాధిపత్యం) ని రద్దు చేసి మిషనరీల రాకకు స్వాతంత్రాన్ని సిద్ధం చేసింది బ్రిటీష్ ప్రభుత్వం. తరువాతి యాక్ట్ 1833లో చార్టర్ యాక్ట్ ను ఆమోదించారు. అంటే  తూర్పు ఇండియా...

వేదాలు లో బాల్య వివాహాల? - Child marriages in vedas - widows in Sanatana Dharma

చిత్రం
బాల్య వివాహాల మొదల్లు వేదంలోనే ఉన్నాయి. బ్రహ్మచర్యేన కన్యా యువానం విందతే పతిం. 11/5/18 అనగా కన్య బ్రహ్మచర్య సేవ ద్వారా యుక్త వయస్కుడైన భర్తను పొందగలదు అని అర్ధం ఇక్కడ 'కన్యా' అంటే రజస్వల కాని ఆడపిల్ల అని అర్ధం. 'కన్యా' అనే పదాన్ని అక్కడ అమ్మాయి కోసం ఉపయోగించారు. 'యువతీ' అనే పదం కాదు. కానీ యువన్ (యువకుడు) అనే పదాన్ని అబ్బాయికి ఉపయోగించారు. దీనితో, మొత్తం విషయం స్పష్టమవుతుంది - అబ్బాయి. యువకుడు, కాని అమ్మాయి ఒక కన్య, ఆ అమ్మాయి పదేళ్ల అమ్మాయి లేదా ఇంకా రజస్వల కాని అమ్మాయి అని అర్ధం.. దశమే కన్యకా ప్రోక్తా అత ఊర్ధ్వం రజస్వలా. వేదమంత్రం బ్రహ్మచర్యంలో నివసిస్తున్న అమ్మాయి, అంటే కన్యత్వానికి భంగం కలిగించబడని, అనగా రజస్వల కాని స్థితిలో తన భర్తను స్వీకరిస్తుందని చెప్పబడింది. స్పష్టంగా, వేదాలు రజస్వల కాని అమ్మాయికి మరియు యువకుడి వివాహం గురించి మాట్లాడుతున్నాయి. సనాతన ధర్మం ప్రకారం భర్త చనిపోయినా స్త్రీ ఉండాల్సిన విధం ? How should be a widow in Sanatana Dharma? కామం తపఎద్దేహం పుష్పమూల ఫలైహ్ శుభైహ్. న తు నామాపి గృహనీయాధృత్మా ప్రతే పరస్య తు 5/15. అంటే, భర్త చనిపోయిన తరువాత, ప...

స్త్రీ ల గురించీ సనాతన ధర్మం - Sanatan Dharma about Women

చిత్రం
స్త్రీ లపై సనాతన ధర్మం చేసిన అనుచిత వ్యాఖ్యలు..  Abusive comments on women in SanatanaDharma.. సనాతనధర్మం ప్రకారం అసలు ఆడవారిని భగవంతుడు ఎందుకూ చేసాడు?  Why did God create women in SanatanDharm?  మనుస్మృతి 2:213,214 - పురుషున్ని మలినపరచడానికి చేయబడింది. మహాభారతం 13.19 స్త్రీలు చెడ్డవారని వేదాలు ఘోషిస్తున్నాయి. వాల్మీకి రామాయణం, అరణ్యకాండం, 45వ సర్గ. 29-30 లక్ష్మణుడు సీతతో అన్న మాట - "భూమి పై స్త్రీలకున్న లక్షణం ఇదే. వారు స్వభావరీత్యా చెడిపోయిన వంకర స్వభావం, చంచల స్వభావం, ధర్మం తెలియని, తండ్రి తనయుల మధ్య బేధం తెచ్చే స్వభావం కలిగి ఉన్నారు.. దేవీభాగవతం 1.15.1-67 మూర్ఖులకు తెలియదు స్త్రీలు యే విధంగా జలగల వలె రక్తం పీలుస్తారో... స్త్రీ కంటే పెద్ద దొంగ యెవడైనా ఉంటాడా?.... సనాతనధర్మం లో స్త్రీ పై గర్భంలో ఉన్నపటి నుండే వివక్ష ప్రారంభo.. పుంసవన్ సంస్కార్ అపసవ్య మనస్తత్వానికి పరాకాష్ట పుంసవన్ సంస్కార్ గురించి స్వామిదయానందసరస్వతి సహచరుడు మరియు తరువాత సనాతన ధర్మ నాయకుడుగా ప్రసిద్ధికెక్కిన వేదవ్యాఖ్యాత - పండిట్ భీమ్ సేన్ శర్మ అంటారు "ఉత్పత్స్య మాన గర్భస్య బైజిక గార్భిక దోష న పరిహా...

భారత దేశానికీ మిషనరీల రాక! - Christian missionaries to India

చిత్రం
  భారతదేశం - దేవుని రాజ్యం ఈ భూభాగంలో దేవుని రాజ్య స్థాపన చేయించడానికి వచ్చిన మిషనరీ సంఘాలు నేపద్యం అలాగే వారు వచ్చిన సంధర్భాలలో వారు పొందిన శ్రమలను వివరిస్తుంది. క్రైస్తవ బాద్యతయైన దేవుని రాజ్య ప్రాతినిధ్యం మిషనరీ ఉద్యమం ద్వారా క్రీస్తు శకం మొదటి శతాబ్దం నుంచే ఎలా ముదలయినది అన్నది. ఇప్పుడు చూద్దాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును" అని యేసు తన శిష్యులకు చెప్పినట్లుగా ముందు యెరూషలేము తరువాత యూదులున్న ఇతర ప్రదేశాలు తరువాత సమరయ అటు తర్వాత భూదిగంతములు అన్న ప్రాతిపదికన అపొస్తలుడైన తోమా కూడా యూదులున్న ప్రాంతాలలో అది కూడా అరమైక్, గ్రీకు మాట్లాడే ప్రాంతాలను దర్శించడానికి పూనుకొని ఉంటాడు అన్నది చరిత్ర కారుల అంచనా. St. తోమా ఇండియాకు వచ్చాడని చెప్పిన వారిలో 2వ శతాబ్దానికి చెందినటువంటి బర్డిసానస్ (Select works of S. EPHREM the syrian).  అలాగే 2వ శతాబ్దానికి చెందిన సిరియన్ క్రైస్తవ సంఘాల వారు ఉన్నారు. నాలుగో శతాబ్దపు కాలంలో క్రైస్తవ్యం భారతదేశంలో ఉందని ఆరవ శతాబ్దపు వ్యాపారస్తుడైన కాస్మాస్ తన ...

సనాతనధర్మం లో సతీసహగమనం - Sati in Sanatan Dharma

చిత్రం
హిందూధర్మం లో సతీసహగమనం వేదాలలో సతీ ప్రధ - Sati in Vedas ఇయం నారీ పతిలోకం వ్రుణానా నిపఘత్ ఉపత్వా మధ్య ప్రేతం ధర్మం పురాణ మనుపాలయంతి తస్మై ప్రజాం ద్రవిణం చేహ దోహి అధర్వ వేదం 18/3/1 The Hymns of the Atharvaveda: Book IX. ఈనారి పతిలోక ప్రాప్తి కొరకు ఓ మృతుడవైన పురుషుడా నీ వద్దకు సమీపించుచున్నది. నీతో కలిసి అగ్నిలో కాలి చనిపోవుచున్నది. ఇలా ఆమె సనాతన ధర్మపాలన చేస్తున్నది. ఇలా నీతో కలిసి కాలుతున్న ఈ స్త్రీకి ఈ లోకం, పరలోకం మరియు పునర్జన్మనందు పుత్రా, పౌత్ర ధనమును ప్రసాదించు. భార్య సతీగా అవడం కారణంగా పునర్జన్మనందు కూడా ఈ భర్తే లభిస్తాడు. రామాయణం లో సతీ - Sati in Ramayana దశరథుని మరణం కారణంగా కౌసల్య అంటుంది “ఇదం శరీరమాలింగ్య ప్రక్ష్యామి హ్రుతానం అయోధ్య కాండం 66/12 అనగా నేను మహారాజు శరీరాన్ని ఆలింగనం చేసుకుని అగ్నిలో ప్రవేశిస్తాను. ఆమె సతీసహగమనం చేయలేదు అన్నది నిజమైనా ఈ సందర్భం. హైందవసంస్కృతి లో సనాతన కాలం నుండి సతీ సహగమనం ఉందని నిరూపిస్తుంది. అలాగే యద కాండ 32/32లో రావణానుగామిష్యామి గతిం భార్తుర్మహాత్మనై - రావణా నేను నా భర్తతో కలిసి సతీగా అవుతాను. తతో మే జననీ దీనా తచ్చరీరం పితుర్మము, పరిశ్వజ...

భారత చరిత్ర సింధు నాగరికత నుండి .. Indian History - భారత దేశంలో ఏకేశ్వర వాదం - Ancient Indian History

చిత్రం
  భారత దేశంలో ఏకేశ్వర వాదం.. భారత దేశానికి మిషనరీల రాక కేవలం 15వ శతాబ్దంలో మొదలయ్యింది అని అనుకోవడం చరిత్రను పూర్తిగా అధ్యయనం చేయక పోవడమే అవుతుంది. ఎందుకంటే జెసుయిట్లు మన దేశానికి మిషనరీ పనికి రాక ముందు నుండే మన దేశంలో క్రైస్తవ మిషనరీ పని మొదలయ్యింది. క్రైస్తవ భావజాలాన్ని బైబిలు నేర్పే ఏకేశ్వర వాదాన్ని ఈ భూభాగంలో తెలియపరచడానికి క్రీస్తు పూర్వం నుండి కూడా ఈ భూభాగ ప్రజలతో మధ్య ఆసియా ప్రజలకు వర్తక, వ్యాపార, రాజకీయ సంబంధాలు ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. ప్రముఖ చరిత్రకారిణి రోమిలా థాపర్ గారి ప్రకారం: క్రీ.పూ. 2600 - 1700 వరకు హరప్పా నాగరికత మన దేశంలో కొనసాగింది. క్రీ.పూ. 1500 - 500 వరకు వైదిక, నియోలితిక్ మరియు చాల్కొలితిక్ సంస్కృతుల వలస, ప్రభావం, ఆవిర్భావం చూస్తాం. క్రీ.పూ. 6వ శతాబ్దంలో గంగానదీ పరివాహక ప్రాంతాలలో నగరాలు, రాజ్య స్థాపనలు మొదలయ్యి మగధ రాజ్యం, మహావీర మరియు గౌతమ బుద్ధుల దర్శనం ఆవిర్భవించినట్టు చూస్తాం. క్రీ.పూ. 519లో పర్షియాకు చెందిన అకేమేడియన్ రాజు సైరస్ (కోరేష్) ఉత్తరభారత భూభాగాన్ని చాల వరకు తన రాజ్యంలో విలీనం చేయడంలో విజయం సాధించాడు. క్రీ.పూ. 493లో అజాత శత్రు రాజ్య స్థాపన చే...

ఏది ప్రధానం? సంఘమా లేక రాజ్యమా? The Church or The Kingdom of God - Which is the Priority?

చిత్రం
ఏది ప్రధానం? సంఘమా లేక రాజ్యమా? క్రీస్తు సంఘానికి మరియు ఆయన రాజ్యానికి అవిభాజ్య సంబంధం ఉంది. క్రీస్తు సంఘము ఆయనను రాజుగా హృదయములయందు ప్రతిష్టించుకున్న వారి సముదాయమైతే ఆయన రాజ్యం మరింత సార్వత్రికంగాను మరియు మరిన్ని క్షేత్రాలలో విస్తరించి ఉంటుంది. క్రీస్తు సంఘము ఆయన శరీరము కనుక ఆ సంఘస్తులకు క్రీస్తు భుజములపై ఉన్న రాజ్య భారం ఉంటుంది. క్రీస్తు శరీరానికి లేక సంఘానికి ఉన్న ప్రధాన బాధ్యత దేవుని రాజ్యాన్ని సృష్టిలో తిరిగి తీసుకు రావడమే. ప్రతి క్షేత్రాన్ని ప్రతి రంగాన్ని తిరిగి క్రీస్తు కొరకు విడిపించడమే సంఘమునకున్న ప్రధాన బాధ్యత, పరిశుద్ధాత్ముని వరములు కలిగి ఆయన ఫలమును సమాజములో అనగా సృష్టి యావత్తులో విస్తరింపజేయడమే సంఘమునకు ఉన్న ప్రధాన లక్ష్యం.  తెలుగు బైబిల్ అనువాదకులు ' ఎక్లీసియా ' అన్న గ్రీకు పదము నుండి సంఘము అనే పదాన్ని తర్జుమాలో వాడారు. ' ఎక్లీసియా ' అన్న పదం చరిత్రలో కేవలం యేసు మాత్రమే వాడలేదు సుమా ఆయన కంటే ముందు గ్రీకులు తమ జ్ఞానమును తత్వ శాస్త్రాన్ని పలు దేశాలకు చేరవేయడానికి ప్రభావమును ఇతర దేశాలపై చూపడానికి వారు చెరపట్టిన రాజ్యాలలోనికి " ఎక్లీసియా " అనే ఒక స్వ...